రాయదుర్గం: పట్టణంలోని రెండవ వార్డులో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం, పొంచివున్న ప్రమాదం
రాయదుర్గం పట్టణంలోని రెండవ వార్డు కళ్ళీమఠం పాఠశాల కు వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. ఐరన్ పోల్ అడుగుబాగం తుప్పు పట్టి విరిగిపోయేలా తయారైంది. ఏ క్షణంలోనైనా పడిపోయే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ప్రమాదం జరగకముందే స్థంబాన్ని మార్చాలని డిమాండ్ చేశారు