రాప్తాడు: మద్దెల చెరువు కనగానపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించిన టిడిపి నేతలు
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కనగానపల్లి టిడిపి మండల కన్వీనర్ పోతులయ్యమాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరించి చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని రానున్న రోజుల్లో నియోజకవర్గా అభివృద్ధికి ప్రజలంతా సహకారం అందించాలని ప్రజలను కోరడం జరిగిందని కనగానపల్లి టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య పేర్కొన్నారు.