రాయదుర్గం: పట్టణంలో ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో దేశభక్తిని చాటేలా విద్యార్థులు నిర్వహించిన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ నాయకులు, సైనికులు భారతమాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. లక్ష్మీబజార్ లో వేలాది మంది విద్యార్థులు 200 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. వివిధ పాఠశాలల్లో జాతీయ జెండాలతో విద్యార్థులు, చిన్నారులు అలరించారు. దేశ భక్తి గేయాలు, ఆటపాటలతో ఉత్సాహంగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నారు.