రాప్తాడు: బాలేపల్లి లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్సీ చైర్మన్ నెట్టెం వెంకటేశులు
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం బాలేపల్లి గ్రామంలో శనివారం 4:30 గంటల సమయంలో టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ చౌదరి డి సి ఎం ఎస్ సి చైర్మన్ వెంకటేశులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రానున్న రోజుల్లో రాప్తాడు అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే పరిటాల సునీతకు ప్రజలంతా సహకారం అందించాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ చౌదరి ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్సీ చైర్మన్ నెట్టెం వెంకటేశులు పిలుపునిచ్చారు.