నంద్యాల అర్బన్: జగన్ పర్యటన సందర్భంగా నంద్యాల జిల్లా వైసిపి అధ్యక్షుడు కాటసానిపై కేసు నమోదు
Nandyal Urban, Nandyal | Aug 16, 2026
పాణ్యం వైసీపీ మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా చెన్నమ్మ సర్కిల్లో గుంపులుగా వచ్చి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారంటూ ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. 'మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతర' అంటూ బ్యానర్ ప్రదర్శించిన తుగ్గలి కార్యకర్తలు నలుగురిపైనా కేసు నమోదైంది. ఆధారాలు లేకుండానే కేసులు పెట్టారని కాటసాని అన్నారు.