కొండపి: సింగరాయకొండలోని చెంచయ్య పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని చెంచయ్య పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం కలకలం రేపింది. చెరువులో ఆ వ్యక్తి చనిపోయి ఉన్న విషయాన్ని గుర్తించి స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహంపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.