ఒంగోలు అర్బన్: హత్య ఘటనపై ఆరా... కేసును త్వరితగతిన ఛేదించేందుకు అధికారులకు పలు కీలక సూచనలు చేసిన ఎస్పీ
Ongole Urban, Prakasam | Aug 17, 2026
ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన ముత్తుకూరు శ్రీదేవి (43) అనే మహిళ మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లంపల్లి సమీపంలో పైపుల ఫ్యాక్టరీ ఎదురుగా సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినారు.ఈ నేపథ్యంలో హత్య జరిగిన నేరస్థలాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం నేరస్థలానికి చుట్టుపక్కల పరిశీలించి, హత్య జరిగిన విధానం, నేరం జరిగిన తీరు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సేకరించిన ఆధారాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు.