శ్రీశైలం: వెలుగోడు జలాశయం వద్ద మాజీ మంత్రి బుడ్డా వెంగల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలం నియోజకవర్గంలో మాజీ మంత్రి స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా వెలుగోడు తెలుగుగంగ జలాశయం వద్ద ఆయన విగ్రహాన్ని రైతాంగం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన కుమారుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైభవంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డశ్రీశైలం నియోజకవర్గంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధిలో బుడ్డా కుటుంబం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. రాయలసీమకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నాడు తెలుగుగంగ ప్రాజెక్టును తీసుకొచ్చిన స్వర్గీయ ఎన్టీఆర్ సేవలు మరులేమన్నారు.