కనిగిరి: పట్టణంలో మహా లక్ష్మమ్మ చెట్టు వీధికి స్వాతంత్ర సమరయోధుడు దర్శి చెంచయ్య రోడ్డుగా మార్పు; ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి
కనిగిరి పట్టణంలోని మహాలక్ష్మమ్మ చెట్టు వీధికి గద్దర్ వీరుడు, కనిగిరి కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత దర్శి చెంచయ్య రోడ్డుగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మార్పు చేశారు. శనివారం రాత్రి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దర్శి చెంచయ్య రోడ్డు శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆవిష్కరించారు. త్వరలోనే ఈ రోడ్డులో దర్శి చెంచయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేసి ఆ మహానీయుడికి ఘనమైన నివాళి అర్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.