నందికోట్కూరు: తరిగోపుల గ్రామంలోని పశువుల పాకలో అగ్ని ప్రమాదం రెండెద్దులు ఓ గేదె సజీవ దహనం
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో రైతు నాగార్జున రెడ్డి పశువుల పాకలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది, రేకుల షెడ్లతోపాటు అందులో ఉన్న రెండు ఎద్దులు, ఓ గేదె సజీవ దహనమయ్యాయ సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని రైతు నాగార్జున రెడ్డి తెలిపారు, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం