ఉరవకొండ: పట్టణంలో డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రెండరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాల అక్రమాలపై సీబీఐ చే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.